అల్లు అర్జున్ సినిమాతో ఎంట్రీ ఇచ్చింది భానుశ్రీ మెహతా. ఆ సినిమా ఫ్లాప్ కావడంతో భానుని తెలుగు చిత్రపరిశ్రమ అస్సలు పట్టించుకోలేదు. దాంతో కొంతకాలం సైలెంట్ అయిపోయింది. ఇప్పుడు నవదీప్ సినిమా అంతా నీ మాయలోనే సినిమాలో అవకాశం అందుకొంది. స్నేహా ఉల్లాల్ ఓ కథానాయిక. రెండో నాయిక పోస్టు భానుశ్రీకి దక్కింది. తెలుగుతో పాటు తమిళ సినిమాలవైపూ దృష్టిపెట్టింది ఈ కథానాయిక. అక్కడ కూడా కొన్ని అవకాశాలు అందుకోగలుగుతోంది. ”అందరూ తొలి అడుగులోనే విజయం సాధించేయరు. ఎదగడానికి కొంత టైమ్ కావాలి. ఆ టైమ్ ఇప్పుడు నాకు నడుస్తోంది. తప్పకుండా ఈసారి విజయం సాధిస్తా..” అని నమ్మకంగా చెబుతోంది భాను శ్రీ మెహతా.