18న టీ.కాంగ్రెస్ విస్తృతస్థాయి సమావేశం

jana reddyతెలంగాణ రాష్ట్ర సాధనే తమ ధ్యేయమని తెలంగాణ కాంగ్రెస్ నేతలు అంటున్నారు. ఈ నేపధ్యం లో ఈ నెల 18న ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో తెలంగాణ కాంగ్రెస్ నేతల విస్తృతస్థాయి సమావేశం నిర్వహించనున్నారు.ఈ సామావేశంలో తెలంగాణ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఇతర సీనియర్ నేతలు పాల్గొంటారు. నిన్న మంత్రి జానారెడ్డితో సమావేశమైన నేతలు ఈ సమావేశం ఏర్పాటు చేయాలని నిర్ణయించిన విషయం తెలిసిందే. తెలంగాణ అంశంపై అధిష్ఠానం కూడా ఏదో ఒకటి తేల్చాలని సిద్ధమవుతుండగా, ఈ ప్రక్రియను మరింత వేగవంతం చేసేందుకు టీ.కాంగ్రెస్ వర్గాలు తమవంతు ప్రయత్నాలు మొదలెట్టాయి.