తెరాస సీనియర్ నేత, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ మరోసారి అధికార కాంగ్రెస్ పార్టీపై విరుచుకు పడ్డారు. కాంగ్రెస్ పార్టీ స్కాముల పార్టీగా మారింది ఆయన ఎద్దేవా చేశారు. తెరాస తెలంగాణ బంద్ కు పిలుపునిచ్చిన నేపథ్యంలో.. ఆయన ఈరోజు విలేకరులతో మాట్లాడుతూ.. తెలంగాణకు ప్యాకేజీలు అవసరం లేదని అన్నారు. కేంద్రం వెంటనే ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని ప్రకటించాలని ఆయన డిమాండ్ చేశారు.