సంకెళ్లతో.. భాజపా ఎమ్మెల్యేలు..!

Kishan reddy bjpసంకెళ్లతో.. భాజపా ఎమ్మెల్యేలు అనగానే కాంగ్రెస్ మంత్రులు, నేతల మాదిరిగా ఏదో కుంభకోణంలో అరెస్టయిన వారు అనుకునేరు సుమా.. ! ఈ నెల 14న తెలంగాణ ఐకాస తలపెట్టిన “ఛలో అసెంబ్లీ”  నేపథ్యంలో.. ప్రభుత్వం చేపట్టిన అక్రమ అరెస్టలను నిరసిస్తూ.. భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యేలు వినూత్నంగా తమ చేతులకు సంకేళ్లు వేసుకొని నిరసన తెలుపుతూ.. శాసన సభలోకి వచ్చారంతే. ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి మాట్లాడుతూ… ఎమర్జెన్సీని తలపించే రీతిలో కాంగ్రెస్ ప్రవర్తిస్తుందని దయ్యబట్టారు. “ఛలో అసెంబ్లీ” సందర్భంగా ప్రాథమిక హక్కులకు విఘాతం కల్పిస్తున్నారని, అక్రమ అరెస్ట్ లను తక్షణమే ఆపివేయాలని ఆయన డిమాండ్ చేశారు. “ఛలో అసెంబ్లీ”ని కాంగ్రెస్ ప్రభుత్వం  అడ్డుకుంటే..  2014 ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్ ను అడ్డుకుంటారని కిషన్ రెడ్డి హెచ్చరించారు.