దాసరి ఇంట్లో ముగిసిన సోదాలు.. !

Dasari-బొగ్గు కుంభకోణం కేసు నేపథ్యంలో.. మాజీ కేంద్ర మంత్రి దాసరి సత్యనారాయణ నివాసంతో పాటుగా ఆయన కార్యాలయం, బంధువుల నివాసాలలో ఈరోజు ఉదయం నుంచి నిర్వహిస్తున్న సీబీఐ సోదాలు ముగిశాయి. ఈ సందర్భంగా సీబీఐ అధికారులు దాసరి నివాసం నుంచి పలు కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం.అంతేకాకుండా, దాసరికి చెందిన ‘సౌభాగ్య మీడియా’ కార్యాలయంలోనూ సీబీఐ అధికారులు సోదాలు జరిపారు. కాగా, ఈరోజు ఉదయం సీబీఐ నమోదు చేసిన ఎఫ్ఐఆర్ లో దాసరి పేరును పేర్కొనడంతో.. ఆయనను పోలీసులు అదుపులోనికి తీసుకునే అవకాశం ఉన్నట్లు వార్తలొచ్చాయి. అయితే, అలాంటి సంఘటనలేమీ జరగకపోవడంతో.. దర్శకరత్న దాసరికి కొంత ఊరట లభించినట్లయింది.