బొగ్గు కేసులో దాసరికి చిక్కులు..!

Dasari-యూపీఏ ప్రభుత్వాన్ని ఓ కుదుపు కుదుపుతున్న బొగ్గు కుంభకోణం దర్శకరత్న దాసరి నారాయణరావును వెంటాడుతోంది. తాజాగా, ఈ కేసుకు సంబంధించి సీబీఐ ఈరోజు ఎఫ్ ఐ ఆర్ నమోదు చేశారు. ఈ ఎఫ్ ఐఆర్ లో కాంగ్రెస్ ఎంపీ నవీన్ జిందాల్, కేంద్ర మాజీ బొగ్గు సహాయ మంత్రి దాసరినారాయణ రావుల పేర్లను పేర్కొంది. దీంతోపాటుగా సీబీఐ ఈ కేసుకు సంబంధించి దేశవ్యాప్తంగా పలుచోట్ల సోదాలకు తెరదీసింది. ఈ క్రమంలో హైదరాబాద్ లోని దాసరి నివాసంలోనూ సోదా చేస్తోంది. నగరంలోని రెండు కంపెనీల్లోనూ ఆధారాల కోసం వెతుకుతున్నట్టు సమాచారం. కాగా, గతంలో కూడా సీబీఐ దాసరి నివాసంలో సోదాలు నిర్వహించిన సంగతి తెలిసిందే.