రవితేజ కథానాయకుడిగా నటించిన చిత్రం బలుపు. శ్రుతిహాసన్, అంజలి కథానాయికలు. గోపీచంద్ మలినేని దర్శకుడు. పీవీపీ సినిమా తెరకెక్కించింది. ఈనెల 28న ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తారు. ఈ సినిమాలో రవితేజ పాత్ర రెండు షేడ్లలో సాగుతుందని తెలుస్తోంది. రవితేజ పలికిన సంభాషణలు, యాక్షన్ ఘట్టాలూ.. ఆకట్టుకొంటాయని చిత్రబృందం చెబుతోంది. ఇందులో బ్రహ్మానందం క్రేజీ మోహన్ పాత్రలోకనిపిస్తారు. క్రేజీ మోహన్గా బ్రహ్మీ నవ్వులు పండించడం ఖాయమని – ఈ సినిమా విజయంలో బ్రహ్మీ నవ్వులే కీలక పాత్ర పోషిస్తాయని చిత్రబృందం నమ్ముతోంది. శ్రుతిహాసన్ తొలిసారి హాట్ హాట్ గా కనిపించనుంది. తమన్ పాటలు మాస్కి చేరువయ్యాయి. ఇక సినిమాలో ఎలా ఉంటాయో మరి. వరుస ఫ్లాప్లతో… నీరసించిన రవితేజ కెరీర్ ఈ సినిమాపైనే ఆధారపడి ఉంది. మరి అతనికి ఎలాంటి ఫలితం దక్కుతుందో చూడాలి.