సోనియా నిందితురాలు కాదా.. ?

Peddireddy-Ramachandraరాష్ట్రంలో శాసనసభాపతి వ్యవస్థను కిరణ్ ప్రభుత్వం భ్రష్టుపట్టించిందన్నారు మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి. శాసనసభాపతిపై కాంగ్రెస్-టీడీపీల ఒత్తిడి పనిచేసిందని, 2 నెలల క్రితం అనర్హులుగా ప్రకటించివుంటే ఎన్నికలు జరిగివుండేవని, అప్పుడు ఎవరి బలం ఏంటో ప్రజలే తేల్చేవారని చెప్పారు. క్విడ్‌ప్రోకో అంటూ జగన్‌ను అన్యాయంగా జైలుపాలు చేశారన్నారు. అదే క్విడ్‌ప్రోకో మంత్రులకు ఎందుకు వర్తించదు? అని ఆయన ప్రశ్నించారు. 2జీ స్పెక్ట్రంలో సోనియా నిందితురాలు కాదా? అని పెద్దిరెడ్డి ప్రశ్నించారు.