ఇద్దరు హీరోల హంగామా చిత్రసీమలో ఎక్కువ అవుతోంది. చిన్నాపెద్దా తేడా లేకుండా… ఇద్దరు కథానాయకులు జట్టు కట్టడానికి రెడీ అవుతున్నారు. ఈ కోవలో మరో బుల్లి మల్టీస్టారర్ సినిమా రాబోతోంది. సునీల్, సుమంత్ అశ్విన్ కథానాయకులుగా జట్టు కట్టబోతున్నారు. ఈ చిత్రానికి తేజ దర్శకత్వం వహిస్తారు. ఎమ్మెస్ రాజు నిర్మాత. ప్రస్తుతం 1000 అబద్ధాలు సినిమాకి తుది మెరుగులు దిద్దుతున్నారు తేజ. ఆ వెంటనే ఇద్దరు హీరోల సినిమా మొదలయ్యే అవకాశాలున్నాయి. తూనీగ తూనీగ సినిమాతో కెరీర్ మొదలెట్టిన.. సుమంత్ అశ్విన్కి ఆ సినిమా ఓ చేదు జ్ఞాపకాన్ని మిగిల్చింది. ఇప్పుడు సునీల్ సపోర్టుతో.. తన కొడుకుని హీరోగా నిలబెట్టాలని ఎమ్మెస్ రాజు భావిస్తున్నారు. ఈ సినిమా గురించిన పూర్తి వివరాలు త్వరలో తెలుస్తాయి.