మోడీకి బాధ్యతల అప్పగింతపై బీజెపీలో డైలమా !

MODIభారతీయ జనతా పార్టీ  ప్రచారసారథిగా గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ పేరు ప్రకటించడంపై..  ఆ పార్టీ తర్జనభర్జన పడుతోంది. బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశానికి పార్టీ అగ్రనేత అద్వానీ సహా, ఉమాభారతి, జశ్వంత్ సింగ్, యశ్వంత్ సిన్హా, శత్రుఘ్నసిన్హా, యోగి ఆదిత్యనాథ్.. తదితరులు  దూరంగా ఉన్నారు. దీంతో.. పార్టీ ప్రచార బాధ్యతలను మోడీకి అప్పగించడం పలువురు సీనియర్ నేతలకు ఇష్టంలేనట్లుగా వార్తలొస్తున్నాయి. ఈ నేపథ్యంలో.. మోడీకి బాధ్యతలు అప్పగింతపై.. ఆ పార్టీ అధిష్టానం డైలామాలో పడినట్లు సమాచారం. ఒకవేళ రేపు కూడా అగ్రనేత అద్వానీ సమావేశాలకు హాజరుకాని యెడల ముగింపు సందేశాన్ని పార్టీ అధ్యక్షుడు రాజ్నాథ్ సింగ్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. పార్టీ ప్రచార కమిటీకి మోడీ సారథ్యంపై రేపు స్పష్టత వచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం.