ప్రధానిపై పిటిషన్ కొట్టివేత !

PM_PTI52జీ కేసులో ప్రధాని మన్మోహన్ సింగ్ కు ఊరట లభించింది. 2జీ కేసులో మన్మోహన్ సింగ్, దయానిధి మారన్ లపై ఎఫ్ ఐఆర్ నమోదు చేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్ విచారించిన ఢిల్లీ న్యాయస్థానం దానిని తోసిపుచ్చింది. గతకొంత కాలంగా 2జీ కేసులో అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రధాని రాజీనామా చేయాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో.. తాజా కోర్టు తీర్పు ప్రధానికి కొంత ఉపశమనం లభించిందనే చెప్పాలి.