‘రూపీ’ పతనంపై ఆందోళన వద్దు !

rupee-అంతర్జాతీయ మార్కెట్ లో ‘రూపాయి’ విలువ పతనంపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కేంద్ర ఆర్థిక మంత్రి చిదంబరం అన్నారు. త్వరలోనే రూపాయి స్థిరత్వ స్థాయికి చేరుకుంటందనే ఆశాభావం ఆయన వ్యక్తం చేశారు. ‘రూపీ’ పతనాన్ని ప్రమాద సంకేతంగా భావించరాదని చిదంబరం తెలిపారు. కాగా, డాలర్ తో రూపాయి
మారకం విలువ 11 నెలల తర్వాత మళ్లీ 57కు పతనమైన విషయం తెలిసిందే.