కల్యాణ్రామ్ కథానాయకుడిగా నటించిన త్రీడీ చిత్రం ఓం. ఆయనే నిర్మాత. కృతికర్బందా, సనాఖాన్ కథానాయికలు. సునీల్రెడ్డి దర్శకత్వం వహించారు. ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకొంది. U/A సర్టిఫికెట్ దక్కింది. ఈనెల 28న ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు. కత్తి తరవాత కల్యాణ్రామ్ నుంచి వస్తున్న సినిమా ఇదే. దాదాపు రెండేళ్ల నుంచి ఈ సినిమా కోసం కష్టపడుతూనే ఉన్నారు. ఈ సినిమాకి రూ.25 కోట్ల బడ్జెట్ అయ్యిందని సమాచారమ్. టెక్నికల్గా హై స్టాండర్డ్లో తెరకెక్కించిన ఈ త్రీడీ సినిమా కల్యాణ్రామ్కి ఎలాంటి విజయాన్ని అందిస్తుందో చూడాలి.