బొత్సతో భేటీయైన డిప్యూటి సీఎం..!

Botsa_Satyanarayanaహస్తినలో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి వ్యతిరేకంగా అసమ్మతి రాజకీయాలు వేడెక్కినట్లు కన్పిస్తున్నాయి. గత రెండు రోజులుగా ఢిల్లీలో మకాం వేసిన పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణను ఈరోజు(గురువారం) ఉదయం డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహ సమావేశమయ్యారు. తాజా రాజకీయ పరిస్థితులపై వీరు చర్చిస్తున్న తెలుస్తోంది. కాగా ఈరోజు ఉదయం 10.45 గంటలకు రాజనరసింహ పార్టీ అధినేత్రి సోనియాగాంధీతో భేటీ కానున్నారు.