ప్రజాస్వామ్యంలో హింసకు చోటులేదు !

Manmohan-Singh-woos-India-Iఢిల్లీలో ప్రధాని అధ్యక్షతన అంతర్గత భద్రతపై ముఖ్యమంత్రుల సమావేశంలో ప్రధాని మన్మోహన్ సింగ్ మాట్లాడుతూ.. వామపక్ష తీవ్రవాదాన్ని ఉక్కుపాదాలతో అణివేస్తామని స్పష్టం చేశారు. ఇందుకోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి పనిచేయాలని ఆయన పిలుపునిచ్చారు. కేంద్రానికి, రాష్ట్ర ప్రభుత్వాలు తీవ్రవాదాన్ని అణిచివేయడంలో పూర్తి స్థాయిలో సహకరిస్తాయన్న ఆశాభావాన్ని ప్రధాని వ్యక్తం చేశారు. కాగా, జమ్మూ కాశ్మీర్ లో శాంతిభద్రతలు  మెరుగుపడ్డాయని మన్మోహన్ తెలిపారు. ప్రజాస్వామ్యంలో హింసకు తావులేదని ప్రధాని స్పష్టం చేశారు.