ఆయన.. కిడ్నాప్ ముఠాలకు అధినేత !

Kodandaramముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కిడ్నాప్ ముఠాలకు అధినేతగా వ్యవహరిస్తున్నారని టీ-జేఏసీ చెర్మెన్ కోదండరాం తీవ్రవ్యాఖ్యలు చేశారు. ఈరోజు కోదండరాం విలేకరులతో మాట్లాడుతూ.. ఎన్ని ఆటంకాలు సృష్టించినా.. ఈ నెల 14న ఛలో అసెంబ్లీ కార్యక్రమాన్ని నిర్వహించి తీరుతామని స్పష్టం చేశారు. అక్రమ బైండోవర్ కేసులు, బెదిరింపు కాల్స్ తో భయపెట్టినా వెనక్కి తగ్గేది లేదని, వాటికి ప్రభుత్వమే బాధ్యత వహించాలని ఆయన డిమాండ్ చేశారు. “ఛలో అసెంబ్లీ”పై గురువారం నుంచి విస్త్రత ప్రచారం నిర్వహిస్తామని కోదండరాం తెలిపారు.