షీలాదీక్షిత్ పై అరవింద్ కేజ్రీవాల్ పోటీ !

Sheela-Dixit-Kejariwal-ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీ ముఖ్యమంత్రి షీలాదీక్షిత్ కు వ్యతిరేకంగా పోటీ చేయనున్నారని బోగట్టా. ఆదివారం ఢిల్లీలో జరిగిన పార్టీ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. గత వారమే ఆమ్ ఆద్మీపార్టీ ఢిల్లీ ఎన్నికల్లో 12 నియోజక వర్గాల్లో పోటీ చేసేందుకు వీలున్న 44 మంది అభ్యర్ధుల పేర్లు ప్రకటించారు. ఢిల్లీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ రికార్డు స్థాయిలో ఢిల్లీకి ముఖ్యమంత్రిగా సేవలందించారు. అయితే గత కొద్ది కాలంగా ఢిల్లీలో అరాచకాలు రాజ్యమేలుతున్నాయి. అనేక ఆటవిక చర్యలకు డిల్లీ కేంద్రమైంది. ముఖ్యంగా నిర్భయ ఉదంతం షీలా సర్కార్ ను కుదిపెసింది. దీంతో గత ఏడాదిగా ఢిల్లీనగరంలో ఏవో ఒక నిరశనలతో ప్రజలు రోడ్డెక్కుతున్నారు. ఈ నేపధ్యంలో ఈ సారి ఎన్నికల్లో విజయం సాధించడం షీలా దీక్షిత్ కు అంత సులువుగా కన్పించడం లేదు.