వైన్ డీలర్స్ తో మంత్రి భేటీ !

pardhasaradiఆంధ్రప్రదేశ్  స్టేట్ వైన్ డీలర్స్ అసోసియేషన్ నేతలు మంత్రి పార్ధసారధితో సచివాలయంలో సమావేశమయ్యారు. కొత్త ఎక్సైజ్ పాలసీ విధివిధానాలపై ఈ సమావేశంలో చర్చింస్తున్నట్లు తెలుస్తోంది. వైన్ షాపులకు ట్రేడ్ మార్జిన్
పెంచాలని, శాంతిభద్రతల పేరుతో వైన్ షాపులను మూసివేయించే రోజులు తగ్గించాలని వైన్ బాస్ లు ఈ సమావేశంలో డిమాండ్ చేశారని సమాచారం. అంతేకాకుండా.. వైన్ షాపులోనే మద్యం తాగే సౌకర్యం కల్పిస్తే బహిరంగ మద్యపానం తగ్గుతుందని కూడా సలహా ఇచ్చారట. అంతేకదా మరి ! తొక్కినోడికే
కదా.. బురద అంటేది.