జెడి లక్ష్మీనారాయణ మహారాష్ట్రకు బదిలీ

j-d-lakshmi-narayanaసిబిఐ జాయింట్ డైరెక్టర్ లక్ష్మీనారాయణను బదిలీ చేస్తున్నట్లు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. జూన్ ఏడో తేదీన తిరిగి తన సొంత క్యాడర్ అయిన మహారాష్ట్ర సర్వీస్ కు వెల్లిపొనున్నారు. ఆయన ముంబై క్రైం బ్రాంచ్ అధినేతగా నియమితులైనట్లుగా తెలుస్తోంది. గతంలో గాలి జనార్ధనరెడ్డి కేసులో సంచలన అధికారిగా పేరుపొందిన లక్ష్మీనారాయణ ఆ తర్వాత జగన్ కేసులో కూడా కీలక పాత్ర పోషించారు.