స్వార్థం చుట్టూ తిరిగే క‌థ‌…

kotha-jantaగౌర‌వం సినిమాతో తెరంగేట్రం చేశాడు అల్లు శిరీష్. కులం గోడ‌ల మ‌ధ్య న‌లిగిన ఓ ప్రేమ జంట గురించి సాగించిన అన్వేష‌ణ అది. శిరీష్ వ‌య‌సుకి అది చాలా భారీ స‌బ్జెక్ట్‌. దాన్ని డీల్ చేయ‌లేక చ‌తికిల ప‌డ్డాడు… శిరీష్‌. ఇప్పుడు త‌న వ‌య‌సుకి న‌ప్పే ఓ ప్రేమ క‌థ‌తో ముందుకు రాబోతున్నాడు. అదే కొత్త జంట‌. గీతా ఆర్ట్స్ ప‌తాకంపై బ‌న్నీ వాసు ఈ సినిమాని తెర‌కెక్కిస్తున్నారు. మారుతి ద‌ర్శ‌కుడు. ఈ చిత్రం గురువారం ఉద‌యం ప్రారంభ‌మైంది. ఇది స్వార్థం చుట్టూ తిరిగే క‌థ అట‌. మ‌నిషి జీవితంలో ఎద‌గ‌డానికి స్వార్థం కావాలి, కానీ స్వార్థ‌మే జీవితం కాకూడ‌దు.. అనే కాన్సెప్టుతో సాగే సినిమా అట‌. శిరీష్ ప‌క్క‌న రెజీనా క‌థానాయిక‌గా న‌టిస్తోంది. ఈ చిత్రానికి జెబి సంగీతం అందిస్తున్నాడు.