పరువునష్టం దావావేస్తారట !

T Subbarami Reddyవిశాఖ ఎంపీ సీటుపై టీఆర్ఎస్, దగ్గుబాటిల మధ్య మాటల యుద్ధం కొనసాగుతూనే ఉంది. నిన్న (బుధవారం) దగ్గుబాటి వెంకటేశ్వరరావు విలేకర్లతో మాట్లాడుతూ.. టి. సుబ్బిరామిరెడ్డిపై సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. దగ్గుబాటి వ్యాఖ్యలపై టీఎస్ఆర్ స్పందిస్తూ.. తనపై వివాదాస్పద ఆరోపణలు చేసిన కేంద్ర మంత్రి పురందేశ్వరి భర్త, దగ్గుబాటి వెంకటేశ్వరరావుపై పరువు నష్టం దావా వేస్తానని హెచ్చరించారు. దగ్గుబాటిది పిచ్చివాగుడని, ఆయన వ్యాఖ్యలపై అధిష్టానానికి ఫిర్యాదు చేస్తానని టీఎస్ ఆర్ అన్నారు. విశాఖ
యుద్ధం తారాస్థాయికి చేరుకుంటుండటంతో… అధిష్టానం కల్పించుకొని యుద్దాన్నేమైనా చల్లారుస్తుందా .. లేదా ప్రేక్షక పాత్ర పోషిస్తుందో వేచి చూడాలి మరీ !