కోర్టుకు హాజరైన నీరా రాడియా

niira-radiaమాజీ కార్పొరేట్ లాబీయిస్టు నీరా రాడియా 2జీ స్పెక్ట్రమ్ కుంభకోణం కేసులో విచారణ నిమిత్తం మంగళవారం ఢిల్లీలోని సీబీఐ కోర్టుకు హాజరయ్యారు. 2జీ స్పెక్ట్రమ్‌ కేటాయింపుల కేసులో కీలక ప్రాసిక్యూషన్‌ సాక్షిగా ఆమె కోర్టుకు హాజరు అయ్యారు. నీరా రాడియా వాంగ్మూలాన్ని సీబీఐ కోర్టు నమోదు చేయనుంది. ఈ సందర్భంగా నీరా రాడియా మాట్లాడిన 62 ఫోన్ సంభాషణల సీడీలను ప్రవేశపెట్టేందుకు సీబీఐ కోర్టు అనుమతి కోరింది.