త్వరలో అసెంబ్లీ ముట్టడి !

Kodandaramప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం త్వరలో అసెంబ్లీని ముట్టడిస్తామని రాజకీయ జేఏసీ చైర్మెన్ ప్రొ. కోదండరాం తెలిపారు. ఇనుపఖనిజ పరిరక్షణ యాత్ర చేస్తున్న కోదండరాం ఈరోజు విలేకరులతో మాట్లాడుతూ.. ప్రత్యేక రాష్ట్రం
ఏర్పడితే మన వనరులను కాపాడుకోవచ్చని, లేదంటే వనరులన్నీ ఆంధ్రాకు తరలిపోతాయే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. టి.జేఏసీ ఇనుపఖనిజ పరిరక్షణ యాత్ర కరీంనగర్ జిల్లా భీమదేవరపల్లి మండలం ఎర్రబెల్లికి చేరుకుంది. ఇక్కడ ఇనుపరాతి గుట్టలను కోదండరామ్ బృందం పరిశీలించింది.