శ్రియ ప్రధాన పాత్రపోషించిన చిత్రం ‘పవిత్ర’. జనార్థన మహర్షి దర్శకత్వం వహించారు. ఈ చిత్రాన్ని జూన్ 7న విడుదల చేస్తారు. శ్రియ నటన, కథ, కథనాలు, జనార్థన మహర్షి రాసిన సంభాషణలు ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయని చిత్రబృందం చెబుతోంది. ఇది ఓ వేశ్య కథే అయినప్పటికీ ఎలాంటి అసభ్యతకూ, అశ్లీలానికీ తావు లేకుండా.. కుటుంబ సమేతంగా చూసేలా మలచామని దర్శకుడు చెబుతున్నాడు. సాయికుమార్, ఏవీఎస్, రోజా, చింటూ కీలక పాత్రలు పోషించారు. చిన్న సినిమా అయినా మంచి చిత్రమైతే ఆదరించడం అలవాటు చేసుకొన్న తెలుగు ప్రేక్షకులకు పవిత్రకు ఏ స్థానం కట్టబెడతారో చూడాలి.