ఫిక్సింగ్ ఉదంతం… ఐపీఎల్ పై ఉన్న ఆసక్తి, ప్రేమ రోజురోజుకీ చంపేస్తున్నాయి. చూస్తున్న ఆటంతా… భూటకం అని తెలుస్తుండడంతో.. ఇప్పటి వరకూ వెర్రిగా చూసిన జనాలు – ఇప్పుడు పొట్టి క్రికెట్ అంటే లైట్ తీసుకొంటున్నారు. జట్టు జండాలు భుజాన వేసుకొని, ప్రచార కర్తలుగా వ్యవహరించిన తారలు కూడా… ఛీ ఇందేం క్రికెట్టూ అని నోరు వెళ్లబెడుతున్నాయి. బాలీవుడ్ అందాల తార దీపికా పదుకొణె కూడా ఇదే మాట అంటోంది. బెంగళూరు రాయల్స్ కి దీపికా బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరించింది. ఆ టీమ్ ప్లే ఆఫ్ కి రాకపోవడంతో దీపికా కాస్త అప్ సెట్ అయ్యింది. ఫిక్సింగ్ వ్యవహారం మరింత నీరసానికి గురి చేసింది ”ఇది క్రికెట్ కి మాయని మచ్చ. ఐపీఎల్ పై ఉన్న ఆసక్తి మొత్తం పోయింది. ఫైనల్ మ్యాచ్ చూడాలన్న ఆసక్తి కూడా లేదు..” అని తెగ ఫీలైపోయింది.