విశాఖ నాదే…. టిఎస్సార్

SubbiramiReddyవిశాఖపట్నం పార్లమెంటరి నియోజకవర్గంలో తాను చేసిన సాంస్కృతిక, సేవా కార్యక్రమాలనుకాంగ్రెస్ అధిష్టానం గుర్తించిందని టి. సుబ్బరామిరెడ్డి సంతోషం వ్యక్తం చేసారు. పార్టీ అధినేత్రి సోనియాగాంధీని కలిసిన తరువాత తనకు ఈ విషయం బోధపడిందని ఆయన చెప్పారు. 2014 ఎన్నికలలో అన్ని నియోజకవర్గాలలో సిట్టింగ్ ఎం. పి. లేక్ సీట్లు ఇవ్వాలని లేదని, వారికంటే సమర్ధులైన వారికి టికెట్లు ఇచ్చేందుకు అధిష్టానం సిద్ధంగా వుందని ఆయన వివరించారు. తనకు విశాఖ సీటును, పురంధరేశ్వరి కి నరసరావుపేట స్థానాన్ని కేటాయిస్తారని తాను భావిస్తున్నట్టు సుబ్బరామి రెడ్డి వెల్లడించారు.