లోకులు కాకులు….!

sakshi-dhoniటీమ్ ఇండియా కెప్టెన్ మహేంధ్ర సింగ్ ధోని భార్య సాక్షికి కోపం వచ్చింది. ఇటీవల వెలుగులోనికి వచ్చిన ఐపీఎల్ స్పాట్ ఫిక్సింగ్ వ్యవహారంతో.. సాక్షికి సంబంధాలున్నాయని ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో.. ఆమె ట్విట్టర్ ద్వారా స్పందించారు. “లోకులు పలుకాకులు.. ఏదో ఒకటి అనడం వారి నైజం..” అని అర్థం వచ్చే హిందీ సినిమా పాటను ఆమె ఉటంకించారు. అయితే స్పాట్ ఫిక్సింగ్ వ్యవహారంలో తనకు ఎలాంటి సంబంధం లేదని.. తన భర్తను ఎంకరేజ్ చేయడం తప్ప క్రికెట్ తో తనకెలాంటి సంబంధం లేదని సాక్షి తన సన్నిహితుల వద్ద అంటుందట.
ఐపీఎల్ స్పాట్ ఫిక్సింగ్ లో పలువురు సినీ ప్రముఖులకు, రాజకీయనాయకులకు, క్రికెటర్లకు.. వారి స్నేహితులకు సంబంధాలున్నట్లు ఆరోపణలొస్తున్నాయి. అయితే ఈ ఆరోపణల్లో కొన్ని నిజమైనతే, మరికొన్ని గాసిప్స్ అయి ఉండవచ్చు. సాక్షి ధోని కూడా తన ట్విటర్ ద్వారా కూడా “లోకులు కాకులు….” అని అందంటే.. ఆరోపణలన్ని నిజం కావని చెప్పడమే మరి!