దుండగుల దాడిలో ఏడుగురు మృతి

seven-pepole-died-in-up-in-property-disputeఉత్తరప్రదేశ్ లో ఓ ఘోరం చోటు చేసుకుంది. ఘజియాబాద్ న్యూసిటీలోని ఓ కుటుంబంపై బుధవారం దుండగుల మారణాయుధాలతో దాడి చేశారు. ఈ దాడిలో ఏడుగురు అక్కడికక్కడే మృతి చెందారు. పోలీసులు సంఘటన స్థలానికి హుటాహుటిన చేరుకున్నారు. దాడి సంఘటనపై పోలీసులు స్థానికుల నుంచి వివరాలు సేకరిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తును ముమ్మరం చేశారు. కాగా ఆస్తి తగాదాలే ఈ హత్యలకు కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు.