ఐపీఎల్-6 కొనసాగుతుంది : సుప్రీం

ipl-spot-fixingఐపీఎల్-6లో వెలుగులోనికి వచ్చిన స్పాట్ ఫిక్సింగ్ నేపథ్యంలో.. తదుపరి ఐపీల్ మ్యాచ్ లు నిలిపివేయాలని దాఖలైన పిటిషన్ పై విచారణకు సుప్రీంకోర్టు అంగీకరించింది. ఈ కేసును విచారించిన అత్యున్నత న్యాయస్థానం ఐపీఎల్ టోర్నీపై నిషేధం విధించలేమని  పేర్కొంది. అయితే, ఐపీఎల్ స్పాట్ ఫిక్సింగ్ వ్యవహారంలో.. బీసీసీఐకి పలు మార్గదర్శకాలు జారీ చేసింది. భవిష్యత్ లో ఇలాంటి అవినీతి చర్యలు జరగకుండా కఠిన చర్యలు తీసుకోవాలని క్రికెట్ బోర్డుకు న్యాయస్థానం ఆదేశాలు జారీచేసింది. దర్యాప్తు పూర్తయ్యేవరకు ఐపీఎల్ నిలిపివేయాలంటూ.. లక్నో కు చెందిన అవస్థి అనే న్యాయవాది సోమవారం సుప్రీంలో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే.