చర్యలకే అధిష్టానం మొగ్గు !

ministers-apకళంకిత మంత్రులపై చర్యలకు కాంగ్రెస్ అధిష్టానం మొగ్గుచూపినట్లు తెలుస్తోంది. ప్రభుత్వ అవసరాలు, పరిణామాలు దృష్టిలో పెట్టుకుని, కళంకిత మంత్రులపై సమయానుకూలంగా నిర్ణయం తీసుకోవాలని సీఎం కిరణ్ కు అధిష్టానం సూచించినట్లు సమాచారం. త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు ఉండటం.. తదితర అంశాలను కూడా పరిగణలోనికి తీసుకోవాలని అధిష్టానం సీఎంకు సూచించింది. దీంతో… రాష్ట్రమంత్రుల్లో కలవరం మొదలైంది. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న మంత్రులపై ఏ క్షణంలోనైనా వేటు పడవచ్చునే వార్తలు రావడంతో.. రాష్ట్రంలో రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి.