అర్.ఫ్.సి లో మెగా సందడి

ramchan allu arujun in rfcచెర్రీ , బన్నీ ఒకేచోట చేరారు. ఇద్దరూ కలిసి ఒకే షూటింగులో పాల్గొంటున్నారు. వంశి పైడి పల్లి దర్శకత్వంలో చరణ్ నటిస్తున్న ఎవడు సినిమా షూటింగ్ ప్రస్తుతం రామోజీ ఫిలిం సిటీలో జరుగుతుంది. ఈ సినిమాలో ఓ ముఖ్య పాత్రలో నటిస్తున్న బన్నీ ఈ రోజు ఈ షూటింగ్ లో పాల్గొన్నాడు. ఈ షూట్ లో చరణ్ , బన్నీలపై కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు దర్శకుడు వంశీ పైడిపల్లి. ఈ సన్నివేశాలు కథలో చాలా కీలకమైనవి అని అంటున్నారు. ఇక దేవిశ్రీ మ్యూజిక్ అందించిన ఈ చిత్రం ఆడియో వేడుకను క జూన్ మొదటి వారంలో జరపడానికి సన్నాహాలు చేస్తున్నారు.