తెరాసలో చేరిన కడియం

kadiyam-join-in-trsతెదేపాకు రాజీనామా చేసిన సీనియర్ నేత కడియం శ్రీహరి ఈరోజు (బుధవారం) తెరాస తీర్థం పుచ్చుకున్నారు. తెలంగాణ భవన్ లో జరిగిన కార్యక్రమంలో తెరాస అధినేత కేసీఆర్ కండువా కప్పి కడియం ను పార్టీలోకి ఆహ్వానించారు. కడియంతో పాటుగా.. పలువురు అనుచరులు ఈ సందర్భంగా తెరాస తీర్థం పుచ్చుకున్నారు. కడియం తెరాసలో చేరుతున్న సందర్భంగా వరంగల్ జిల్లా స్టేషన్ ఘన్ పూర్ నుంచి పెద్ద సంఖ్యలో కార్యకర్తలు ర్యాలీగా తెలంగాణ భవన్ కు చేరుకున్నారు. కాగా, తెదేపాలో పొలిట్ బ్యూరో సభ్యుడిగా ఉన్న కడియం ఇటీవలే ఆ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే.