18న హస్తినకు సీఎం కిరణ్..!

cm-kiran-missingముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఈనెల 18న ఢిల్లీకి వెళ్లనున్నారు. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న పలువురు మంత్రుల వ్యవహారంపై.. అధిష్టానంతో సీఎం చర్చలు జరిపే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న మంత్రులను కేంద్రంలో తొలగించిన నేపథ్యంలో.. సీఎం ఢిల్లీ టూర్ ప్రాధాన్యతను సంతరించుకుంది. రాష్ర్టంలో కూడా అవినీతి మంత్రుల విషయంలో.. కేంద్రం కఠినంగా వ్యవహరించవచ్చనే ఊహాగానాలు మొదలయ్యాయి. దాంతో పాటుగా రాష్ర్టంలో తాజాగా రాజకీయ పరిస్థితులపై సీఎంతో అధిష్టానం చర్చించే అవకాశం ఉన్నట్లు సమాచారం.