22న కాంగ్రెస్ విస్తృతస్థాయి సమావేశం : బొత్స

botsaకాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశాన్ని ఈనెల 22న నిర్వహించనున్నట్లు పీసీసీ అధినేత బొత్స సత్యనారాయణ వెల్లడించారు. పార్టీ సంస్థాగత నిర్మాణం, భవిష్యత్ ఎన్నికలు లక్ష్యంగా.. ఈ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకోనున్నట్లు తెలుస్తోంది. ఈ సదస్సులో మండల, బ్లాక్, జిల్లా స్థాయి నేతలందరూ పాల్గొంటారని బొత్స తెలిపారు.