ఈ నెల 17 వ తేదీన పదవ తరగతి ఫలితాలు వెలువడనున్నాయి. మార్చి 22 నుంచి ఏప్రిల్ 9 వరకు నిర్వహించిన పదవతరగతి పరీక్షలకు 12 లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు. త్వరలోనే వాల్యుయేషన్ పూర్తికానుందని, ఫలితాలను ఈనెల17వ తేది ఉదయం 11 గంటలకు విడుదల చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్లు మాధ్యమిక విద్యాశాఖా మంత్రి పార్థసారధి తెలిపారు. గ్రేడ్ల వారీగా ఫలితాలు విడుదలకానున్నాయి. ఫలితాల విడుదల అనంతరం విద్యార్థులకు రీకౌంటింగ్ తో పాటూ రీ వెరిఫికేషన్ కు కూడా అవకాశం కల్పించనున్నారు.