ఢిల్లీకి.. బాబు !

ntr-statue-in-parlamentతెదేపా అధినేత చంద్రబాబు నాయుడు పార్లమెంట్ లో “ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ”కు వెళ్లడంపై ఏర్పడిన సందిగ్దతకు తెరపడింది. తాజాగా ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ కార్యక్రమానికి హాజరు కావాలని లోక్ సభ స్వీకర్ మీరాకుమారి బాబుకు ఆహ్వానం పంపించారు. దీంతో అధినేతతో కలసి తెదేపా ఎంపీలులు కూడా అన్న ‘ఎన్టీఆర్’ విగ్రహావిష్కరణ కార్యక్రమానికి హాజరుకావాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. నిన్నటి వరకు నాకు అసలే ఆహ్వానం అందలేదన్న బాబు.. స్వీకర్ ఆహ్వానంతో.. హస్తినాకి వెళ్లడానికి రెడీ అవుతున్నారన్నమాట!.