ఈ శుక్రవారం రెండు సినిమాలు బాక్సాఫీసు ముందుకు రాబోతున్నాయి. సుకుమారుడు, తడాఖా… ఢీ కొట్టుకోబోతున్నాయి. రెండూ యువ హీరోల చిత్రాలే. రెండు సినిమాల్లోనూ వారసత్వ హీరోలున్నారు. కాబట్టి… పోటా పోటీ పోరాటం జరిగే అవకాశాలున్నాయి. నాగచైతన్య, సునీల్ కథానాయకులుగా నటించిన చిత్రం తడాఖా. కిషోర్ దర్శకత్వం వహించారు. మరోవైపు సాయికుమార్ తనయుడు ఆది… సుకుమారుడుతో హ్యాట్రిక్ కొట్టడానికి ఉవ్వీళ్లూరుతున్నాడు. పిల్లజమిందార్ తో పేరు తెచ్చుకొన్న.. అశోక్ దర్శకత్వం వహించిన చిత్రమిది. రెండింటితో పోలిస్తే… తడాఖాకే గ్లామర్ ఉంది. ఎందుకంటే.. మిల్కీబ్యూటీ తమన్నా తన అందచందాలతో మత్తెక్కించే పనిలో ఉంది. ఆమెతో పాటు ఆండ్రియా కూడా జత కలిసింది. సునీల్ కి బీసీల్లో మంచి మార్కెట్ ఉంది. చైతూ ఉండనే ఉన్నాడు. బెల్లంకొండ సురేష్ తన సినిమాలకు పబ్లిసిటీ విషయంలో ఎప్పుడూ రాజీ పడరు. ఈ సినిమాకీ భారీ ఎత్తున ప్లాన్ చేస్తున్నారు. అందుకే సుకుమారుడు కంటే… తడాఖాకే ఓపెనింగ్స్ బాగా వచ్చే అవకాశం ఉంది. సినిమా బాగుంటే మాత్రం… సుకుమారుడు నిలబడిపోతుంది. ఎందుకంటే ఈ సినిమాలో ఫ్యామిలీకి కావల్సిన ఎమోషన్స్ ఉన్నాయి. కృష్ణ, శారద పాత్రలు తప్పకుండా పెద్ద వారిని ఆకట్టుకొనేలా తీర్చిదిద్దారట. అనూప్ బాణీలు, ఆది స్టెప్పులూ యూత్ కి పట్టేసే అవకాశాన్నాయి. మరి ఈ బాక్సాఫీసు పోరులో… ఏ సినిమాలు నిలుస్తుందో చూడాలి.