ఆది కథానాయకుడిగా నటించిన చిత్రం ‘సుకుమారుడు’. నిషాఅగర్వాల్ జోడీ కట్టింది. అశోక్ జి. దర్శకత్వం వహించారు. సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకొన్న ఈ చిత్రం విడుదలకు సిద్ధమైంది. ఈనెల 10న ఈ సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తారు. కుటుంబ బంధాల నేపథ్యంలో సాగే సినిమా ఇది. కృష్ణ, శారద కీలక పాత్రలు పోషించారు. ఆదికి ‘ప్రేమకావాలి’, ‘లవ్లీ’ తరవాత కచ్చితంగా హ్యాట్రిక్ సినిమా అవుతుందని చిత్రబృందం ధీమాగా ఉంది. అనూప్ బాణీలు, వాటికి ఆది వేసిన స్టెప్పులు యువతరానికి నచ్చుతాయని, కుటుంబమంతా కలిసి కట్టుగా చూసే చిత్రం అవుతుందని దర్శక నిర్మాతలు చెబుతున్నారు.