పూరీకి ప్రెస్టీజి క్వశ్చన్

Puri-iddarammailathoఇద్దరమ్మాయిలతో థియేటర్ ట్రయిల్ విడుదలయింది. వరుస ఫ్లాపులతో సతమతమవుతున్న పూరి జగన్నాథ్ ఈ సారి కాస్త జాగ్రత్తగా సినిమా తీస్తుతున్నట్లు అనిపించింది. ట్రయిలర్ చూస్తుంటే. ఒకప్పటి శిష్యులు, స్వంత సినిమాలు తీసుకోవడం, సినిమాలను, ప్రేక్షకులను పూరి లైట్ తీసుకోవడం వంటి వ్యవహారాలతో ‘దేవుడు చేసిన మనషులు’, ‘కెమెరామెన్ గంగతో రాంబాబు’ సినిమాలు బకెట్ తన్నేసాయి. ‘ఇద్దరమ్మాయిలతో’ హిట్ కొడితేనే మళ్లీ మహేష్ బాబు మరో అవకాశం ఇచ్చేది. మహేష్ చరిష్మాతో ‘బిజెనెస్ మెన్’ లా బండి లాగించేయచ్చు. దానాదీనా కావాల్సింది ‘ఇద్దరమ్మాయిలతో’ హిట్ కొట్టితీరాలి. అందుకే పూరి చాలా టైమ్ తీసుకుంటున్నాడు. సాధారణంగా పూరి చాలా వేగంగా సినిమాలు తీస్తాడని పేరుపడ్డాడు. కానీ ఈ సినిమాకు కాస్త ఎక్కువ సమయం పట్టింది.