సీఎం దళిత ద్రోహి : శంకర్రావు

Shankar-Rao-demandsమాజీ మంత్రి, కంటోన్మెంట్ ఎమ్మెల్యే పి. శంకర్రావు సీఎం పై విరుచుకుపడ్డారు. దళితులపట్ల సీఎం అనుసరిస్తున్న తీరు వల్ల కాంగ్రెస్ పార్టీకి దళితులు దూరమవుతున్నారని పేర్కొన్నారు. ఈరోజు శంకర్రావు హైదరాబాద్ లో విలేకరులతో మాట్లాడుతూ.. ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహను, తనను ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి అవమానించడంతో.. పార్టీకి దళితులు దూరమవుతున్నారని ఆరోపించారు. సీఎంను దళిత ద్రోహి, రాబందు శంకరన్న పేర్కొన్నారు. కాంగ్రెస్ కు దళితులను దూరం చేసే కుట్ర జరుగుతోందని ఆయన అన్నారు.

సీఎం కిరణ్ ప్రవర్థన వల్ల దళితులే కాకుండా మైనార్టీలు సైతం కాంగ్రెస్ కు దూరమవుతున్నారని ఆయన అన్నారు. ఇటీవలి కాలంలో ఒవైసె సోదరులను ఇబ్బందులకు గురిచేయడంతో.. మైనార్టీలు కాంగ్రెస్ పార్టీకి దూరమయ్యే పరిస్థితి ఏర్పడిందని శంకర్రావు అన్నారు. గ్రీన్ ఫీల్డ్ భూకుంభకోణంలో పోలీసులు తనపై అక్రమ కేసులు బనాయించారని ఆయన ఆరోపించారు. రాష్ట్రంలో పోలీసు రాజ్యం నడుస్తోందని శంకర్రావు ఆవేదన వ్యక్తం చేశారు. కాగా, గ్రీన్ ఫీల్డ్ భూ కుంభకోణం కేసులో శంకర్రావు నిన్ననే బెయిల్ పై రిలీజ్ అయిన విషయం తెలిసిందే.