Prabhas : వయనాడ్ బాధితులకు ప్రభాస్ ఆపన్నహస్తం.. రూ.2 కోట్ల విరాళం


Prabhas donates Rs. 2 crores to the victims of Wayanad : కేరళ లోని వయనాడ్ లో ఇటీవల ప్రకృతి సృష్టించిన విషాధం గురించి అందరికి తెలిసిందే. భారీ వర్షాల కారణంగా కొండ చరియలు విరిగిపడి దాదాపు 350 మందికి పైగా ప్రాణాలు కోల్పోగా, వందల మంది గాయపడ్డారు. మరికొందరు గల్లంతయ్యారు. ఈ క్రమంలో వరద బాధిత కుటుంబాలను ఆదుకునేందుకు ప్రభుత్వంతో పాటు దేశవ్యాప్తంగా పలువురు సెలబ్రిటీలు ముందుకు వస్తున్నారు. ఇప్పటికే సినీ పరిశ్రమలోని పలువురు స్టార్స్ విరాళాలు ప్రకటించగా, తాజాగా ప్రభాస్ కూడా ఈ జాబితాలో చేరారు.

Also Read : Double Ismart : ‘డబుల్ ఇస్మార్ట్’ లో బోల్డ్ క్యారెక్టర్ చేశా..

వయనాడ్ బాధితుల సహాయార్థం 2 కోట్ల రూపాయలను కేరళ సీఎం రిలీఫ్ ఫండ్ కు విరాళంగా ఇస్తున్నట్లు ప్రకటించారు ప్రభాస్. వయనాడ్ ప్రజలకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ.. ఈ కష్ట సమయంలో కేరళ ప్రజలు ధైర్యంగా ఉండాలని, వారికి మనమంతా అండగా ఉండాలని ప్రభాస్ కోరారు. ఇక ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవి, మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ కోటి రూపాయిలు, అల్లు అర్జున్ 25 లక్షలు, రష్మిక మందన్న 10 లక్షలు, హీరో సూర్య, జ్యోతిక, కార్తి కలిసి 50 లక్షలు, మమ్ముట్టి, దుల్కర్‌ సల్మాన్‌ కలిసి రూ.35 లక్షలు, కమల్ హాసన్ 25 లక్షలు, హీరో విక్రమ్​ 20 లక్షలు, న‌య‌న‌తార‌, విఘ్నేశ్ దంప‌తులు 20 లక్షలు కేరళ సీఎం రిలీఫ్ ఫండ్ కు విరాళంగా ఇచ్చారు.

Also Read : Pushpa 2 : పుష్ప 2 క్లైమాక్స్ గూస్ బంప్స్ అంతే..!