Paarijatha Parvam : ‘రంగ్ రంగ్ రంగీలా’ అంటూ చిందేసిన శ్రద్దా దాస్..


చైతన్య రావు, సునీల్, శ్రద్ధా దాస్, మాళవిక సతీశన్ ప్రధాన పాత్రలలో, సంతోష్ కంభంపాటి దర్శకత్వంలో వస్తున్న హిలేరియస్ క్రైమ్ కామెడీ ఎంటర్ టైనర్ ‘పారిజాత పర్వం’. ఈ చిత్రాన్ని వనమాలి క్రియేషన్స్ బ్యానర్ పై మహీధర్ రెడ్డి, దేవేష్ నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ చిత్రం కాన్సప్ట్ టీజర్, ఫస్ట్ సింగిల్ ‘నింగి నుంచి జారే’ పాటకు మంచి రెస్పాన్స్ వచ్చింది.

తాజాగా ‘రంగ్ రంగ్ రంగీలా..’ పాటని విడుదల చేశారు మేకర్స్. కంపోజర్ రీ ఈ పాటని ఫ్యాషినేటింగ్ క్యాచి క్లబ్ నెంబర్ గా కంపోజ్ చేశారు. సరస్వతీ పుత్ర రామజోగయ్య శాస్త్రి అందించిన సాహిత్యం మరింత ఆకర్షణీయంగా వుంది. ఈ పాటలో నటించిన శ్రద్ధా దాస్ స్వయంగా పాటని పాడటం విశేషం. శ్రద్ధా దాస్ వాయిస్, గ్లామరస్ ప్రజెన్స్ ఈ పాటకు ప్రత్యేక ఆకర్షణ తీసుకొచ్చింది. ఈ చిత్రానికి రీ సంగీతం అందిస్తున్నారు. వైవా హర్ష, శ్రీకాంత్ అయ్యంగార్, సురేఖ వాణి, సమీర్, గుండు సుదర్శన్ , జబర్దస్త్ అప్పారావు, టార్జాన్ , గడ్డం నవీన్, తోటపల్లి, మధు, జబర్దస్త్ రోహిణి ఇతర తారాగణం.