శివాజీ ఎవ‌రికీ దొరక‌డంట‌!

dorakaduశివాజీ క‌థానాయ‌కుడుగా న‌టించిన చిత్రం ‘దొర‌క‌డు’. గాయ‌త్రి క‌థానాయిక‌. వ‌ర‌ప్రసాద్ ద‌ర్శక‌త్వం వ‌హించారు. ఈ సినిమా షూటింగ్ పూర్తయింది. ప్రస్తుతం నిర్మాణానంత‌ర కార్యక్రమాలు జ‌రుగుతున్నాయి. త్వర‌లోనే పాట‌ల్ని విడుద‌ల చేస్తారు. ఈ సంద‌ర్భంగా ద‌ర్శకుడు మాట్లాడుతూ.. ఆద్యంతం ఆస‌క్తిగా నడిచే క‌థ ఇది. శివాజీ కెరియ‌ర్‌ లో గ‌ర్వంగా చెప్పుకొనే సినిమాగా మ‌లిచాం. ఇటీవ‌ల యానాం ప‌రిస‌ర ప్రాంతాల్లో గాయ‌త్రిపై ఓ పాట తెర‌కెక్కించాం. దాంతో చిత్రీక‌ర‌ణ పూర్తయింది. మే రెండో వారంలో పాట‌ల్ని విడుద‌ల చేస్తాం.. అన్నారు. ఈ చిత్రానికి సునీల్ ధ‌ర్మా సంగీతం అందిస్తున్నారు. చాలాకాలం నుంచి స‌రైన సినిమాలేక డీలా ప‌డిన శివాజీ కెరియ‌ర్‌… ఈ సినిమాతో అయినా పుంజుకొంటుందేమో చూడాలి.