Keeda Cola : ‘కీడా కోలా’ ని తప్పకుండా ఎంజాయ్ చేస్తారు : రానా దగ్గుబాటి


తన తొలి రెండు చిత్రాలు ‘పెళ్లి చూపులు’, ‘ఈ నగరానికి ఏమైంది’ బ్లాక్ బస్టర్ విజయాలతో అందరి ప్రసంశలు అందుకున్న యంగ్ అండ్ ట్యాలెంటడ్ దర్శకుడు తరుణ్ భాస్కర్ దాస్యం తన మూడో చిత్రంగా క్రైమ్ కామెడీ మూవీ ‘కీడా కోలా’తో వస్తున్నారు. బ్యాక్-టు-బ్యాక్ హిట్‌లను అందించిన దర్శకుడు న్యూ కమ్మర్స్ తో కలసి హాస్య బ్రహ్మ బ్రహ్మానందం ప్రధాన పాత్రలో ఒక యూనిక్ ఎంటర్ టైనర్ ని ఎంచుకున్నారు. ఇప్పటికే విడుదలైన క్యారెక్టర్ పోస్టర్లు, టీజర్‌తో ఈ సినిమా హ్యుజ్ బజ్ ని క్రియేట్ చేశాయి. తాజాగా ఈ చిత్రాన్ని సమర్పిస్తున్న హ్యాండ్సమ్ హంక్ రానా దగ్గుబాటి ‘కీడా కోలా’ థియేట్రికల్ ట్రైలర్‌ను లాంచ్ చేశారు.

ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో రానా దగ్గుబాటి మాట్లాడుతూ.. “తాము అనుకున్న కథని బలంగా నమ్మి, కథకు కథనానికి కట్టుబడి సినిమాలు తీసే ఫిల్మ్ మేకర్స్ చాలా అరుదుగా వుంటారు. తరుణ్ భాస్కర్ కూడా అలాంటి అరుదైన దర్శకుడు. ఒరిజినల్ సినిమాలు చేసే తరుణ్ భాస్కర్ లాంటి ఫిల్మ్ మేకర్ తెలుగు పరిశ్రమలో వుండటం ఒక గౌరవంగా భావిస్తాను. కీడా కోలా చిత్రాన్ని తరుణ్ చూపించినపుడు చాలా నవ్వుకున్నాను. ప్రేక్షకులు కూడా ఎంజాయ్ చేస్తారనే నమ్మకం వుంది. తరుణ్ సినిమాల్లో ఎప్పుడూ చూడని కొత్త నటీనటులని ఇందులో చాలా కొత్తగా చూస్తున్నాం. నవంబర్ 3న సినిమా వస్తోంది. సినిమా చూడండి. తప్పకుండా ఎంజాయ్ చేస్తారు” అన్నారు.

ట్రైలర్ కట్ చేయడంలో తన మార్క్ చూపించారు తరుణ్ భాస్కర్. అంతేకాదు ట్రైలర్ చూస్తుంటే ఒక క్రేజీ రైడ్ లా ఉంటుంది. ఇందులో 9 ప్రధాన పాత్రలు వున్న ఈ కథ కీడా, బార్బీ చుట్టూ తిరుగుతుంది. కీడా చుట్టూ కొంత ఉత్కంఠ ఉన్నప్పటికీ అది రివిల్ చేయలేదు, బార్బీ వాల్యూ మిలియన్లు. మిగిలిన ప్రధాన పాత్రలు హిలేరియస్ క్రేజీ ఫన్ రైడ్ ని ప్రజెంట్ చేశాయి.

వరదరాజులు తాతగా బ్రహ్మానందం, వాస్తుగా చైతన్యరావు, లంచంగా రాగ్ మయూర్, నాయుడుగా తరుణ్, సికిందర్‌గా విష్ణు, జీవన్‌గా జీవన్‌కుమార్, సీఈవోగా రవీంద్ర విజయ్, షాట్స్‌గా రఘురామ్ అందరూ సీరియస్‌గా కనిపించినా వారి యాక్ట్స్ మాత్రం హ్యుమర్ ని తెచ్చిపెట్టింది..అదే కీడా కోలా బ్యూటీ. ఇకపోతే నవంబర్ 3న ఈ సినిమా విడుదల కానుంది.