రేపే ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ రిలీజ్ డేట్ అనౌన్స్మెంట్ !


టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క, యంగ్ హీరో నవీన్ పోలిశెట్టితో కలిసి నటిస్తున్న సినిమా ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’. ఒక చెఫ్‌కు, కమెడియన్‌కు మధ్య సాగే ప్రేమకథ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకి మహేష్‌బాబు పి దర్శకత్వం వహించారు. లాంగ్ గ్యాప్ తర్వాత అనుష్క నటిస్తున్న సినిమా కావడంతో ఈ సినిమాపై అంచనాలు పెరిగాయి. దీనికి తోడు ఇప్పటికే విడుదలైన పోస్టర్స్, టీజర్ సినిమాపై మరించ ఆసక్తిని పెంచాయి. అయితే ఈ సినిమా ఎప్పుడెప్పుడు రిలీజవుతుందా అని ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్న తరుణంలో, మేకర్స్ దీనికి సంబంధించిన అప్డేట్ ఒకటి ప్రకటించారు.

ఈ సినిమా రిలీజ్ డేట్ అనౌన్సమెంట్ రేపు(జూలై 3) మధ్యాహ్నం 1 : 35 గంటలకు ఉంటుందని పోస్టర్ ద్వారా ట్విట్టర్ వేదికగా అధికారకంగా ప్రకటించింది చిత్రయూనిట్. ఇదిలా ఉండగా ఇప్పటివరకు ఈ సినిమాను ఆగ‌స్టు 4న విడుద‌ల చేస్తారనే వార్త నెట్టింట్లో వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. మరి ఆగ‌స్టు 4న రిలీజ్ చేస్తారా లేదా మరో డేట్ ప్రకటిస్తారా తెలియాలంటే రేపటి వరకు ఆగాల్సిందే. ఇక యువీ క్రియేషన్స్ బ్యానర్ వారు నిర్మిస్తున్న ఈ సినిమా తెలుగు, తమిళ్, మలయాళ, కన్నడ భాషల్లో గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది.