ధనుష్ ‘కెప్టెన్‌ మిల్లర్‌’ ఫస్ట్ లుక్.. మాములుగా లేదుగా


ధనుష్ ప్రధాన పాత్రలో అరుణ్ మాథేశ్వరన్ దర్శకత్వంలో వస్తున్న యాక్షన్ థ్రిల్లర్‌ చిత్రం కెప్టెన్‌ మిల్లర్‌. ఈ సినిమాలో హీరోయిన్ గా ప్రియాంక మోహన్ నటిస్తుంది.1930-40ల నేపథ్యంలో పీరియాడికల్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ చిత్రం ధనుష్ కెరీర్ లోనే హైయెస్ట్ బడ్జెట్ మూవీగా రూపొందుతోంది. ఐతే తాజాగా ఈసినిమా ఫస్ట్‌లుక్‌ని విడుదల చేశారు మేకర్స్.

ఈ ఫస్ట్ లుక్ పోస్టర్ లో ధనుష్ గన్‌తో రగ్గడ్ లుక్‌లో కనిపించాడు. అంతేకాకుండా చుట్టూ సైనికుల శవాలతో, దూరంగా వాహనాలతో యుద్ధం లాంటి దృశ్యం క‌నిపిస్తోంది. ఇక రెస్పెక్ట్ ఈజ్ ఫ్రీడమ్ అంటూ ధనుష్ ఈ పోస్టర్‌ను సోషల్ మీడియాలో షేర్ చేశాడు. కాగా ఈ సినిమాలో కన్నడ స్టార్ శివరాజ్‌ కుమార్ ప్రధాన పాత్రలో నటిస్తుండగా.. సందీప్ కిషన్, నివేదితా సతీశ్‌, అమెరికన్‌ యాక్టర్‌, ఆర్‌ఆర్‌ఆర్‌ ఫేం ఎడ్వర్డ్‌ సొన్నెన్‌బ్లిక్ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రానికి జీవీ ప్రకాశ్‌ కుమార్‌ సంగీతం అందిస్తున్నారు. కాగా ఈ చిత్రం తెలుగు, తమిళం, హిందీ భాషల్లో ఏకకాలంలో విడుదల కానుంది.