ఆధ్యంతం ఉత్కంఠభరితంగా ‘విరూపాక్ష’ ట్రైలర్ !


మెగా హీరో సాయి ధరమ్ తేజ్ హీరోగా వస్తున్న లేటెస్ట్ మూవీ విరూపాక్ష. కార్తీక్ దండు అనే కొత్త దర్శకుడు తెరకెక్కిస్తున్న ఈ మూవీలో మళయాళ బ్యూటీ సంయుక్తా మీనన్ హీరోయిన్ గా నటిస్తోంది. తాజాగా ఈ మూవీ నుండి ట్రైలర్ ని రిలీజ్ చేశారు మేకర్స్. హైదరాబాద్‌లోని ప్రసాద్స్ మల్టీప్లెక్స్‌లో జరిగిన కార్యక్రమంలో మేకర్స్ ఈ చిత్రం యొక్క థియేట్రికల్ ట్రైలర్‌ను ఆవిష్కరించారు. ఇప్పటికే టీజర్‌తో ప్రేక్షకుల్లో క్యూరియాసిటీ క్రియేట్ చేసిన విరూపాక్ష.. ట్రైలర్ లోని ఇంట్రెస్టింగ్ అండ్ థ్రిల్లింగ్ అంశాలతో ప్రేక్షకులను విశేషం గా ఆకట్టుకుంటుంది. సినిమాకి సంబందించిన మెయిన్ కాన్సెప్ట్ ని రివీల్ చేయకుండా ఆధ్యంతం ఉత్కంఠగా కొనసాగింది ట్రైలర్. రుద్రవనం అనే గ్రామంలో జరిగే వరుస ఆకస్మిక మరణాల వెనుకున్న కారణాన్ని కనుగొనే ఇంటరెస్టింగ్ క్యారెక్టర్లో హీరో సాయి ధరమ్ తేజ్ కనిపించనున్నాడు. స్థానికుల మృతి వెనుక ఎవరున్నారు? తేజ్ ఆ మిస్టరీని ఎలా ఛేదించాడు? అన్ని సమాధానాలు తెలియాలంటే వచ్చే శుక్రవారం వరకు ఆగాల్సిందే. అయితే ఇక్కడ మరో విశేషం ఏంటంటే.. ఈ సినిమాకి స్టార్ డైరెక్టర్ సుకుమార్ స్క్రీన్ ప్లే అందిస్తున్నాడు. దీంతో.. ఈ సినిమాపై అంచనాలు మరో లెవల్కి చేరుకున్నాయి.

ఇక టెక్నీషియన్స్ విషయానికి వస్తే.. ఈ మూవీకి శ్యామ్ దత్ అందించిన సినిమాటోగ్రఫీ అయితే టాప్ నాచ్ లో ఉంది. ప్రతీ ఫ్రెమ్ చాలా రించి గా కనిపిస్తుంది. అంజనీష్ లోకనాథ్ అందించిన సంగీతం కూడా బాగుంది. ఇప్పటికే రిలీజ్ అయిన సాంగ్స్ కూడా ప్రేక్షకులని అలరిస్తున్నాయి. మొత్తంగా చూస్తే.. చాలా గ్యాప్ తరువాత వస్తున్న సాయి ధరమ్ తేజ్.. ఈ సినిమాతో భారీ హిట్ కొట్టే అవకాశం ఉంది. ఈ పాన్ ఇండియా లెవల్లో రానున్న ఈ మిస్టికల్ థ్రిల్లర్‌ మూవీలో.. సునీల్, అజయ్, బ్రహ్మాజీలు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర మరియు సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ మూవీ ఏప్రిల్ 21, 2023న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది.