ఓటీటీలోకి వచ్చేసిన ‘రంగమార్తాండ’..


క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ దర్శకత్వంలో ప్రకాష్ రాజ్, బ్రహ్మానందం, రమ్యకృష్ణ, రాహుల్ సిప్లిగంజ్, శివాత్మిక రాజశేఖర్, ఆదర్శ్ బాలకృష్ణ, అనసూయ భరద్వాజ్ తదితరులు కీలక పాత్రలు పోషించిన ఈ యాక్షన్ ఎమోషనల్ ఎంటర్టైనర్ మూవీ ఇటీవల ఆడియన్స్ ముందుకి వచ్చి పెద్ద విజయం అందుకుంది. అయితే ఈ సినిమా థియేట‌ర్ల‌లో రిలీజైన 15 రోజుల్లోనే ఓటీటీలోకి వ‌చ్చేసింది. శుక్ర‌వారం(ఏప్రిల్ 7) అమెజాన్ ప్రైమ్‌లో ఈ సినిమా రిలీజైంది. ఎలాంటి ముంద‌స్తు స‌మాచారం లేకుండా సైలెంట్‌గా ఈ సినిమాను ఓటీటీలో రిలీజ్ చేశారు.

ఇకపోతే రంగమార్తాండలో ప్రకాష్ రాజ్, రమ్యకృష్ణ, బ్రహ్మానందం తమ తమ పాత్రల్లో ఒదిగిపోయి కనబరిచిన అద్భుత సహజత్వ నటనతో అందరి మన‌సుల్ని క‌దిలించారు. ఇక ఇళ‌య‌రాజా ఈ సినిమాకు సంగీతాన్ని అందించారు.