‘జేపీసీ’ ఎదుట ప్రధాని హాజరుకావాల్సిందే : వెంకయ్య

venkaiah-naiduభాజపా సీనియర్ నేత వెంకయ్య నాయుడు కాంగ్రెస్ పై తీవ్రంగా విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం తమ స్వార్థ, తాత్కాలిక ప్రయోజనాలకోసం రాజ్యాగ సంస్థలను భ్రష్టు పట్టిస్తోందని ఆరోపించారు. ప్రధాని మన్మోహన్ సింగ్ పదవిలో కొనసాగే అర్హత కోల్పోయారని ఆయన విమర్శించారు. 2జీ స్పెక్ట్రమ్ స్కాంలో.. జేపీసీ ఎదుట మన్మోహన్, ఆర్థిక మంత్రి హాజరు కావాలని వెంకయ్య డిమాండు చేశారు. భారత్ భూబాగంలోనికి చైనా సైన్యం దాదాపుగా 10 కి.మీ మేర వచ్చిన ప్రభుత్వం గట్టిగా స్పందించకపోవడం విడ్డూరంగా ఉందని ఆయన అన్నారు. చైనాలాంటి పవర్ ఫుల్ దేశం భారత్ సరిహద్దులోకి చొచ్చుకొని వస్తుంటే.. ఈ అంశం చాలా చిన్నదని విదేశాంగ మంత్రి మాట్లాడటం విచిత్రంగా ఉందని వెంకయ్య అన్నారు. ఈ నేపథ్యంలో.. ప్రధాని పదవిలో కొనసాగే అర్హతలేదని.. రాజీనామ చేయాల్సిందేనని ఆయన డిమాండ్ చేశారు.