మెగా మల్టీస్టారర్ ఆరంభం


ఈరోజు మెగా ఫ్యాన్స్ ఎంతగానో ఆసక్తిగా ఎదురు చూస్తున్న మరో ఇంట్రెస్టింగా అండ్ సెన్సేషనల్ కాంబో అయితే ఇప్పుడు ఎట్టకేలకు అనౌన్స్ అయ్యింది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అలాగే సుప్రీమ్ హీరో సాయి ధరమ్‌ తేజ్‌ కాంబినేషన్‌లో రాబోతున్న కొత్త సినిమా షూటింగ్‌ బుధవారం నుండి ప్రారంభమైంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫొటోలు వైరల్‌ అవుతున్నాయి. తమిళంలో సూపర్‌ హిట్‌ అయిన ‘వినోదాయ సిద్ధం’ సినిమాను తెలుగులో రీమేక్‌ చేస్తున్నారు. సముద్రఖని తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో పవన్‌ కల్యాణ్‌, సాయి ధరమ్‌ తేజ్‌ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది.

ఇక పవన్ కళ్యాణ్ తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకుంటున్న సాయిధరమ్‌ తేజ్‌ ‘ఈ రోజు నా జీవితంలో మర్చిపోలేనిది. నా కల నిజమైంది. నా గురువుగారు పవన్‌తో కలిసి పనిచెయ్యాలని ఎప్పటి నుంచో ఎదురుచూశాను. ఆయనతో కలిసి పనిచేస్తూ ఎన్నో విషయాలు నేర్చుకుంటాను. ఆ జ్ఞాపకాలను ఎప్పటికీ గుర్తుంచుకుంటాను’ అని ట్వీట్‌ చేశాడు.